Saturday, September 10, 2011

ఆమె కథ - 6 (ఆఖరి భాగం)


ఇక చదవండి....
                                                           
                                                           ఎప్పటిలాగే మనవాడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కాలచక్రం గిర్రున తిరిగి రెండో సంవత్సరం రానే వచ్చింది. మళ్ళీ 30,000 ఎలాగా అని ఆలోచిస్తుంటే దేవుడు వరమిచ్చినట్లు ప్రభుత్వం వారు స్కాలర్ షిప్ ప్రకటించటం , కాలేజ్ వారు ప్రథమ, ద్వీతీయ ర్యాంకులు  వచ్చిన వారికి నగదు బహుమతులు ఇవ్వడంతో కష్టాలు తీరినాయి. ఎలాగైతేనేమి ఆ పిల్లాడు కష్టపడి 4సం||లు చదివి ఇంజనీర్ అయ్యాడు. అతడి ప్రతిభను గమనించిన ఒక బహుళ సంస్థల కంపెనీ అతనికి నెలకు 30,000 ఆదాయం వచ్చే ఉద్యోగం ఇచ్చింది. ఇక వారి ఆనందానికి అవధి లేదు. అతడు కూడా వారి సహాయాలను విస్మరించక అతడి ఖర్చుల నిమిత్తం ఉంచుకుని మిగితా జీతం వీరికే పంపసాగాడు.

                                     ఇతడి ప్రతిభాపాటవాలు, కష్టపడి పని చేసే తత్వం గమనించిన కంపెనీవారు ఇతనిని విదేశానికి కూడా పంపారు. అతడు అక్కడ పని చేస్తూనే ఈ పల్లెలో వీరి కోసం పెద్ద స్థలం కొని ఆ పిల్లలందరి బాధ్యత తనే తీసుకున్నాడు.

                                  ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పుడామెకు 80సం||లు. కొంతకాలం క్రితమే తాత కన్నుమూసాడు, తాత పోయిన మూణ్ణెళ్ళకే  ముసలామె కూడా చనిపోయింది. వారిద్దరూ పోతూ పోతూ పిల్లలను ఆమె చేతిలో పెట్టి పోయారు.

                                  క్రమేణా పిల్లలందరూ బాగా ఎదిగి ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన పెద్దవాడు ఆ పిల్లలందరితో కలిసి "XXX అనాథ శరణాలయం" మరియు "XXX వృద్ధాశ్రమం" కట్టించాడు.

                                    ఇప్పుడామె పనులన్నీ మానేసింది. అన్నిటినీ చూసుకోవడానికి మనుషులున్నారు. ఆమె పని పర్యవేక్షించడం మాత్రమే. పిల్లలందరూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఒక వారం వుండి వెళతారు. ఆమె వారి కోసం ఎన్నో పిండి వంటలు చేయించి వారు వచ్చినప్పుడు స్వయంగా తానే వడ్డించేది. వారు ఒకరొకరే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.

         జీవితానికి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి. బ్రతికితే ఇలా బ్రతకాలి. ఏమంటారు? 

                                 ఈ సంస్థలకు ప్రభుత్వం నుండి కూడా కొంత ధనం లభించసాగింది. ఆ 10 మంది పిల్లల దయ వల్ల ఇప్పుడు అది ఎన్నో శాఖలుగా విస్తరిస్తుంది. ఏ  శాఖలోలైనా శరణాలయం, ఆశ్రమం పక్క పక్కనే ఉండటంతో పిల్లలు తాతయ్య, అమ్మమ్మలతో... పెద్దలేమో పిల్లలతో ఆనందంగా గడపసాగారు.

                  వీరి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ సంస్థ స్థాపకులను అభినందిస్తూ  "XXXX" అవార్డుతో సత్కరించింది. పెద్దవాడు ఆమెను వెంట తీసుకెళ్ళి ఆ అవార్డు గవర్నరుగారి చేతుల మీదుగా ఆమెకు ఇప్పించాడు.

                              ఆమె కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి "ఈ అవార్డుకు అసలు హక్కుదారు నేను కాదు, ఒక 10మంది పిల్లలను చేరదీసిన అమ్మానాన్నలది" అంటూ తాత కథ వివరించింది.

                              ఇదంతా వింటున్నవారందరి కళ్ళు చెమర్చాయి. కొందరి కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి. కానీ, ఇద్దరి భ్రుకుటులు మాత్రం ముడిపడ్డాయి. వారే కొడుకు, కోడలు. వెంటనే ఆ పల్లెకు వచ్చారు. ఆమె ఉన్నతిని చూస్తూ ఏమనుకున్నారో ఏమో తెలీదండీ "మాతో రా అమ్మా!" అంటే "మాతో రండి అత్తయ్యా!" అని ఒకటే గొడవ. మనవడికి కొడుకు పుట్టాడట. విని సంతోషించింది.

                              "మీరు ఇచ్చిన గది చాలు బాబూ నాకు. ఆ సొమ్ము కూడా నాకు అక్కర్లేదు" అంటూ 20,000 తీసి వారి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.  ఇదంతా తెలుసుకున్న మనవడు ఆమె వద్దకు వచ్చి "అమ్మమ్మా! నా తండ్రి చేసిన తప్పుకు నేను క్షమాపణలు చెప్పుకుంటాను. నా భాద్యతగా మా ఊరిలోని మీ సంస్థయొక్క బాగోగులు నేను చూసుకుంటాను" అని అన్నాడు.

పోనిలే మనవడైనా మంచివాడిగా మిగిలాడు అని సంతోషించి అలాగే కానిమ్మంది.

ఇదంతా గమనించిన ఆమె కొడుకూ, కోడలు "మమ్మల్ని క్షమించండీ" అంటూ పాదాలు పట్టుకున్నారు.

పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా, అందులోనూ అమ్మ మనసు, వారిని క్షమించింది. ఆ రోజు నుంచి వారు కూడా అక్కడే ఆశ్రమంలో ఉంటూ అక్కడి పనులు చూసుకుంటున్నారు.

కాలం మనెవ్వరి నేస్తం కాదు కదండీ మన కోసం ఆగకుండానే పరిగెత్తుతూ, నీకంటే నే ముందంటూ తనతో పాటు ఆమెను కూడా తీసుకెళ్ళింది.

"ఆమె" ఇప్పుడు లేదు, కానీ ఆమె ఆశలు, ఆశయాలు అన్నీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటాయి.

మరి మనం ఏ మాత్రం పక్కవారికి సహాయం చేస్తున్నాం. ఒక్కసారి పరీక్షగా చూడండి ఎందరో మన సహాయం కోసం వేచియున్నారు.
కదలండి.... కాపాడండి.... "మనుషులం" అని చాటి చెప్పండి.  


ఆమె కథ పూర్తిగా చదవడానికి ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి
ఆమె కథ


   

2 comments:

  1. kadha mugimpu bavundi. concept bavundi.everybody has to follow.

    ReplyDelete
  2. Chaala Baaundi, AAme kadha.

    ReplyDelete